calender_icon.png 22 June, 2025 | 11:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ నిర్వాసితులకు చెక్కులు అందజేత

11-06-2025 12:12:08 AM

దేవరకొండ, జూన్ 10: దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే  క్యాంప్ కార్యాలయలో పెద్దగట్ట 10మంది లబ్ధిదారులకు 13లక్షల రూపాయలు, అంబా భవాని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం అందిస్తున్న 32 లక్షల రూపాయల విలువ గల నష్టపరిహార చెక్కులను 30మంది లబ్ధిదారులకు రెవెన్యూ , ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి మంగళవారం చెక్కులను పంపిణీ చేశారు.

అనంతరం నక్కలగండి ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న వారి పునరావాసం కొరకు చింతపల్లి గ్రామం వద్ద నిర్మించ తలపెట్టిన ఆర్ అండ్ ఆర్ కాలనీ కోసం సేకరించిన భూములకు ఆయా రైతులకు ప్రభుత్వం నుంచి 84లక్షల రూపాయల విలువ గల నష్టపరిహారం చెక్కులను 09 మంది లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూ నిర్వాసితుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని,ఈ ప్యాకేజ్ ద్వారా భూ నిర్వాసితులకు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా వారి జీవనోన్నతికి అవసరమైన సహాయ సహకారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వారు పేర్కొన్నారు.

భూములు కోల్పోయి నష్టపరిహారం రాని రైతులకు, భూనిర్వాసితులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం, పునరావాసం కల్పిస్తుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఎస్సీ భద్రు, ఈఈ నెహ్రూ నాయక్, రాములు నాయక్, ఆర్డిఓ రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.