17 April, 2026 | 9:41 PM

Breaking News

రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •  

మంథనిలో కల్తీ ఆహార పదార్థాలపై కమిషనర్ కన్నెర్ర

23-04-2025 06:33 PM

మంథని (విజయక్రాంతి): మంథనిలో కల్తీ ఆహార పదార్థాలపై కమిషనర్ మనోహర్(Commissioner Manohar) కన్నెర్ర చేశారు. బుధవారం పట్టణంలోని వివిధ హోటల్స్, కిరాణం షాప్స్, బేకరీ షాపులలో ప్లాస్టిక్, కల్తీ ఆహార పదార్థాలపై కమీషనర్ మనోహర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. షాపుల్లో తిరుగుతూ ప్లాస్టిక్ (కవర్స్, గ్లాసులు) అమ్మకం చేస్తున్న దుకాణ యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే జరిమానా విధించారు. ఎక్సపైరీ డేట్ అయిపోయిన ఆహార పదార్థాలను ఆయన సీజ్ చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... ప్రజల జీవితాలతో షాపుల యాజమాన్యులు ఆటలాడుకోవద్దని హెచ్చరించారు. నాణ్యమైన, కల్తీ లేని ఆహారాలను ప్రజలకు అందించాలని సూచించారు. షాపు యాజమాన్యులు ఎక్స్పైరీ డేట్ అయిపోయిన కల్తీ ఆహార పదార్థాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కమిషనర్ మనోహర్ వెంట హెల్త్ అసిస్టెంట్ సునీల్, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.