8 June, 2026 | 7:40 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

ముగిసిన కాకా వెంకటస్వామి మెమోరియల్ అంతర్ జిల్లా టీ- లీగ్ పోటీలు

26-12-2025 02:33 AM

ముకరంపుర, డిసెంబరు 25 (విజయ క్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, కరీంనగర్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అలుగునూరులోని కరీంనగర్ డిస్ట్రిక్ క్రికెట్ అసో సియేషన్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ అంతర్ జిల్లా టి20 లీగ్- 2025 పోటీలు గురువారం ముగిసాయి. ముఖ్య అతిథిగా మాజీ మేయర్, బిజెపి నాయకుడు యాదగిరి సునీల్ రావు హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కరీంనగర్ జిల్లా నుండి మరింత మంది అమన్ రావులు రావాలని అన్నారు.

కరీంనగర్ నగరంలో ఇంత మంచి క్రికెట్ గ్రౌండ్ ను అందించినందుకు నగర, జిల్లా ప్రజలందరికీ పక్షాన ఆగమ రావు, వారి టీమ్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. క్రికెట్ అనేది డెడికేషన్ తో కూడుకున్న ఆట అని, అవకాశం బట్టి ఆడుకునే ఆట కాదని అన్నారు. క్రికెట్ ఆడడం వల్ల చాలా ఉన్నాయని, అవకాశాలు అందుపుచ్చుకోవడం మీ చేతుల్లోనే ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ బాధ్యులు మహేందర్ గౌడ్, మురళీధర్ రావు, అజిత్ రావు, విద్యాసాగర్, తదితరులు పాల్గొన్నారు.