06-10-2025 06:39:15 PM
దౌల్తాబాద్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మద్దెల స్వామి తండ్రి ఇటీవల మరణించిన విషయం తెలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, పలువురు జర్నలిస్టులు ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా స్వామి కుటుంబానికి ధైర్యం చెబుతూ, మృతుని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆది వేణుగోపాల్, దార సత్యనారాయణ, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాజిరెడ్డి, గౌరవ అధ్యక్షుడు బ్యాగరి శంభులింగం, కోశాధికారి యాదగిరి, ప్రధాన కార్యదర్శి గణేష్ పంచమి, సీనియర్ జర్నలిస్ట్ దుర్గారెడ్డి, కాంగ్రెస్ నాయకులు అబ్బాగౌని రాజాగౌడ్, ఆది బాలకృష్ణ, డాకోల్ల ఆంజనేయులు గౌడ్, గొల్ల ఎల్లయ్య, కుమ్మరి శ్రీనివాస్, పోషమైన రాజు, తలారి మహేష్ తదితరులున్నారు.