29-06-2025 05:34:21 PM
బల్కంపేట శ్రీ ఎల్లమ్మ దేవస్థాన బోర్డు సభ్యురాలిగా నియామకం
సనత్ నగర్,(విజయక్రాంతి): బల్కంపేట శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లీ దేవస్థానం బోర్డు సభ్యురాలిగా గోదాసి ఉమారాణి నియమితులవడాన్ని గర్వకారణంగా పేర్కొంటూ, గండిపేట కార్పొరేటర్ గోపాల గణేష్, గోపాల సునీత, సుగంధ పుష్పలత ఆమెను కలిసి హృదయపూర్వకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... "గోదాసి ఉమారాణి సామాజిక సేవలో ఎంతో చురుకైన వ్యక్తిగా, మహిళా అభ్యున్నతికి నిబద్ధతతో పని చేసే వ్యక్తిగా మా అందరికీ సుపరిచితురాలు.
ఆమెకు ఈ బోర్డు సభ్యత్వం లభించడం అత్యంత గర్వకారణం. ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యానికి ఆమె అంకితభావంతో పనిచేస్తారని మాకు నమ్మకం ఉంది" అని తెలిపారు. అలాగే భవిష్యత్తులో ఆలయ నిర్వహణలో పారదర్శకత, సద్వినియోగం, సంక్షేమ కార్యక్రమాల ప్రోత్సాహానికి ఉమారాణి సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గోదాసి ఉమారాణి "ఈ గౌరవాన్ని నాకు అందించిన వారందరికీ ధన్యవాదాలు. దేవస్థాన అభివృద్ధి, భక్తుల అభ్యున్నతి కోసం నేను నిరంతరం కృషి చేస్తాను" అని అన్నారు.