calender_icon.png 1 June, 2025 | 8:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపక్షం

16-05-2025 12:40:49 AM

కామారెడ్డి/ఎల్లారెడ్డి, మే 15,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల పక్షమేనని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు  అన్నారు. గురువారం తాడ్వాయి మండలంలోని ఎర్రపహాడ్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

అర్హులైన ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరవుతుందని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే 3,500 డబుల్ బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేశామని వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.