24-06-2025 10:04:31 PM
మందమర్రి (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. మంగళవారం మండలంలోని సండ్రోన్ పల్లి రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంబరాలు నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... తొమ్మిది రోజుల వ్యవధిలో రాష్ట్రంలోని రైతులకు 9000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో జమ చేయడం అభినందనీయమన్నారు.
రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు, అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గందె రామచందర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు నీలయ్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు పుల్లూరు లక్ష్మణ్, సీనియర్ నాయకులు సొత్కు సుదర్శన్, మాజీ సర్పంచులు రాచకొండ కమల మనోహర్ రావు, గోదారి రాజేష్, నర్సింగోజు తిరుపతి, అసంపల్లి రాజయ్య, మాజీ ఎంపిటిసి సభ్యులు దుర్గం కుమారస్వామి, నాయకులు కొట్టే సంపత్, ఆకుల అంజి, రాములు, సుధాకర్, రైతులు పాల్గొన్నారు.