16-06-2025 12:00:00 AM
మొక్కలు నాటిన వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు
కామారెడ్డి, జూన్ 15 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఫాదర్స్ డే సందర్భంగా మొక్కలు నాటారు. అసోసియేషన్ సభ్యులు పర్యావరణ పరిరక్షణ ఫాదర్స్ డేకు గుర్తుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు హరారే సుధాకర్ రావు, ఉపాధ్యక్షుడు లక్ష్మీనరసింహులు, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్, కోశాధికారి నాగరాజు, సంయుక్త కార్యదర్శి శివాజీ రావు, ముఖ్య సలహాదారులు పడిగేల రాజేశ్వరరావు, జైపాల్ రెడ్డి, తో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.