calender_icon.png 20 June, 2025 | 5:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్నెట్‌లో వెదికి మరీ.. కాళేశ్వరం అక్రమాలు తెలుసుకుంటున్నారు

20-06-2025 01:06:47 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం అక్రమాల గురించి ఇంటర్ నెట్ లో వెదికి మరీ తెలుసుకుంటున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Congress MP Chamala Kiran Kumar Reddy) గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సూచించారు. కాళేశ్వరం అక్రమాలపై(Kaleshwaram irregularities) ప్రజలు అవగాహన పెంచుకుంటున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజలను బీఆర్ఎస్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఎంపీ చామల కిరణ్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.

రాయలసీమ ఎత్తిపోతల(Rayalaseema Lift Irrigation), పోతిరెడ్డిపాడు పనులు జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అభ్యతరం చెప్పలేదని విమర్శించారు. బనకచర్లను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని ఆయన వివరించారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని కూడా రేవంత్ రెడ్డి చెబుతున్నారని తెలిపారు. కేంద్రం మన ఆలోచనలు పరిగణలోకి తీసుకోకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పష్టం చెప్పారని వెల్లడించారు. తెలంగాణ సెంటిమెంట్ రేకెత్తించి తప్పుదోవ పట్టించేందుకు బీఆర్ఎస్ నేతలు(BRS leaders) ప్రయత్నిస్తున్నారని చామల వివరించారు. బనకచర్ల అంశంపై తప్పనిసరిగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఏకగ్రీవ తీర్మాణం చేస్తామంటేనే బీఆర్ఎస్ ఎంపీ సమావేశం నుంచి వాకౌట్ చేశారని  చామల కిరణ్ పేర్కొన్నారు.