17 April, 2026 | 3:18 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

డ్రగ్స్ తయారీ ముఠా గుట్టురట్టు

16-12-2025 06:10 PM

నంద్యాల: నంద్యాల జిల్లాలోని నందికొట్కూరులో డ్రగ్స్ తయారీ ముఠా గుట్టురట్టు అయింది. నంద్యాల పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఎంబీయే చదువుతున్న విద్యార్థి మాదక ద్రవ్యాల టోలుయెన్ తయారీ కేంద్రం నడిపిస్తున్నాడు.  డ్రగ్స్ తయారీ కేంద్రంపై మంగళవారం దాడికి పాల్పడిన తెలంగాణ నార్కోటిక్ పోలీసులు అనుమతి లేకుండా అల్ర్పాజోలమ్ డ్రాగ్ తయారు చేసినట్లు గుర్తించారు.

భారీ స్థాయిలో మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మత్తు పదార్థాలను తయారు చేస్తున్న విద్యార్థి మధు, అతని తండ్రి సురేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ డ్రగ్స్ తయారీ, రవాణాలో అంతర్‌ రాష్ట్ర నెట్‌వర్క్ ఉందని, కీలక ఆధారాలను నార్కోటిక్స్​ బృందం  సేకరిస్తోంది. ఈ డ్రగ్స్ ముఠాలో స్థానికులతో పాటు బయటి వ్యక్తుల పాత్రపై ఉందని అనుమానం వ్యక్తమవుతోంది. ఈ మేరకు నార్కోటిక్ బృందం కేసు నమోదు చేసి లోతుగా విచారణ జరుపుతోంది.