15 April, 2026 | 1:18 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

డ్రగ్స్ తయారీ ముఠా గుట్టురట్టు

16-12-2025 06:10 PM

నంద్యాల: నంద్యాల జిల్లాలోని నందికొట్కూరులో డ్రగ్స్ తయారీ ముఠా గుట్టురట్టు అయింది. నంద్యాల పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఎంబీయే చదువుతున్న విద్యార్థి మాదక ద్రవ్యాల టోలుయెన్ తయారీ కేంద్రం నడిపిస్తున్నాడు.  డ్రగ్స్ తయారీ కేంద్రంపై మంగళవారం దాడికి పాల్పడిన తెలంగాణ నార్కోటిక్ పోలీసులు అనుమతి లేకుండా అల్ర్పాజోలమ్ డ్రాగ్ తయారు చేసినట్లు గుర్తించారు.

భారీ స్థాయిలో మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మత్తు పదార్థాలను తయారు చేస్తున్న విద్యార్థి మధు, అతని తండ్రి సురేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ డ్రగ్స్ తయారీ, రవాణాలో అంతర్‌ రాష్ట్ర నెట్‌వర్క్ ఉందని, కీలక ఆధారాలను నార్కోటిక్స్​ బృందం  సేకరిస్తోంది. ఈ డ్రగ్స్ ముఠాలో స్థానికులతో పాటు బయటి వ్యక్తుల పాత్రపై ఉందని అనుమానం వ్యక్తమవుతోంది. ఈ మేరకు నార్కోటిక్ బృందం కేసు నమోదు చేసి లోతుగా విచారణ జరుపుతోంది.