15 April, 2026 | 1:18 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

సింగరేణి ఇన్‌ఛార్జ్ సీఎండీగా ఐఏఎస్ అధికారి కృష్ణ భాస్కర్

16-12-2025 05:46 PM

హైదరాబాద్: సింగరేణి ఇన్ ఛార్జి సీఎండీగా ఐఏఎస్ అధికారి కృష్ణ భాస్కర్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఎండీ బలరాం డిప్యుటేషన్ పూర్తికావడంతో కేంద్ర సర్వీసుకు వెళ్లారు. ప్రస్తుతం ఆయన స్థానంలో కృష్ణ భాస్కర్ కు ఈ బాధ్యతలు అప్పగించినట్లు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర రెవెన్యూ సర్వీసు నుంచి డిప్యుటేషన్ పై తెలంగాణకు వచ్చిన బలరాం సింగరేణిలో సంచాలకుడిగా, ఇన్ ఛార్జీ సీఎండీగా మొత్తం ఆరేళ్ల పాటు పనిచేశారు. కేంద్రం నుంచి వచ్చిన అధికారులకు డిప్యుటేషన్ గడువు సాధారణంగా ఐదేళ్లపాటు ఉంటుంది. కానీ, అదనంగా మరో ఏడాది గడువు పొడిగించాలని తెలంగాణ సర్కార్  కేంద్ర ప్రభుత్వంతో విజ్ఞప్తి చేసింది.