28-10-2025 06:27:49 PM
తాడ్వాయి (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా జరగాలని మండల ప్రత్యేక అధికారి రఘునందన్ తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కన్కల్, తాడ్వాయి గ్రామాలలో మంగళవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు వేగవంతంగా నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాజిద్ అలీ, అధికారులు పాల్గొన్నారు.