15 April, 2026 | 1:13 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ప్రగతి భవన్ ముట్టడిస్తాం

28-10-2025 06:24 PM

రీయంబర్స్ మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి

బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు

కామారెడ్డి (విజయక్రాంతి): ప్రభుత్వ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని లేకుంటే ప్రగతిభవన్లో ముట్టడిస్తామని బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో నీల నాగరాజు మాట్లాడుతూ ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు విడుదలలో జాప్యం వల్ల లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత 4 సంవత్సరాలుగా నిర్ణీత సమయానికి స్కాలర్షిప్, ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లించకపోవడం వల్ల కాలేజీ యాజమాన్యాలు బంద్ పాటిస్తామని చెప్పడంతో విద్యార్థులంతా తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారన్నారు. 

ప్రభుత్వం కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరిపి దశల వారీగా 1200 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని మాట ఇచ్చి కూడా తప్పడంతో యాజమాన్యాలు సమ్మెకు దిగడంతో బడుగు ,బలహీనవర్గాల విద్యార్థులు చదువుపై శ్రద్ద పెట్టలేక, పై చదువులు ఎలా సాగుతాయోనాన్న భయాందోళనకు గురవుతున్నారు. డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఈడీ తదితర కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులపై చదువులు, ఉద్యోగాల నిమిత్తం సర్టిఫికెట్ల కోసం కళాశాలలకు వెళ్తే ఫీజు బకాయిలు రానందున విద్యార్థులే ఫీజు చెల్లించి తమ సర్టిఫికెట్లు తీసుకెళ్లాలని షరతులు విధించడంతో దిక్కుతోచని స్థితిలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారని వాపోయారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని లేని పక్షంలో లక్షలాది మంది విద్యార్థులతో ప్రగతి భవన్ ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.దయాకర్, మహేష్,నరేష్, రాము,జీవన్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.