17 April, 2026 | 2:42 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

బీసీ రిజర్వేషన్లకు నిరంతరం పోరాటం

18-10-2025 04:29 PM

బీజేపీ మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్

చిట్యాల: బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ అన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధనకై శనివారం బీసీ సంఘాలు రాష్ట్ర బందుకు పిలుపునివ్వడంతో బీజేపీ మద్దతు తెలుపుతూ మండలంలోని పాఠశాలలను, వ్యాపార వాణిజ్య దుకాణాలను ఆయన బంధు చేయించారు. ఈ సందర్భంగా బుర్ర వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ కామారెడ్డిలో ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే విధంగా జీవో 9 తీసుకొచ్చిందన్నారు.

బీసీల సంక్షేమం కోసం అనుక్షణం పాటుపడేది బీజేపీ మాత్రమేనని, స్వార్థ రాజకీయాల కోసం బీసీలను ఉపయోగించుకునేది కాంగ్రెస్, బీఆర్ఎస్ అని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యే వరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మండల నాయకులు గుండ సురేష్, చెక్క నరసయ్య, రాయిని శ్రీనివాస్, మైదం శ్రీకాంత్, వల్లాల ప్రవీణ్, కేంసారపు ప్రభాకర్, చింతల రాజేందర్, ఉమ్మనని రాజేష్, కలవచర్ల కిషోర్, శ్రీహరి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.