15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

టేకులపల్లిలో బీసీ బంద్ సంపూర్ణం

18-10-2025 04:31 PM

అన్ని పార్టీలు, కులసంఘాల మద్దతు..

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలంలో శనివారం బీసీ బంద్ సంపూర్నంగ జరిగింది. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం రెండింటి వరకు ఒక్క దుకాణం కూడా తెరవలేదు. ప్రతి శనివారం నిర్వహించే సంత కూడా పూర్తిగా నిలిచి పోవడం విశేషం. అధికార కాంగ్రెస్, బీఆర్ ఎస్, బీజేపీ, టీడీపీ, సీపీఎం, సిపిఐ, సిపీఐ ఎం ఎల్ మాస్ లైన్ ప్రజాపందా, సిపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసి, తెలంగాణ ప్రజా ఫ్రాంట్, ఎమ్మార్ పీఎస్, సేవాలాల్ సేన, ఎల్ హెచ్ పీఎస్ తదితర పార్టీలు, కులసంఘాలతో పాటు, బీసీ కులసంఘాల నాయకులూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొదట బస్టాండ్ సెంటర్ లో గంట పాటు రాస్తారోకో నిర్వహించి అక్కడి నుంచి బోడు క్రాస్ రోడ్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు.

సమావేశం నిర్వహించి నాయకులందరూ మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, బేతంపూడి పీఏసిఎస్ అధ్యక్షుడు లక్కినేని సురేందర్ రావు, కాంగ్రెస్ నాయకుడు కోరం సురేందర్, అన్ని పార్టీల నాయకులూ బంద్ లో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టేకులపల్లి సిఐ బత్తుల సత్యనారాయణ, ఎస్సై రాజేందర్, పోలీస్ సిబ్బందితో బందోబస్త్ నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, ప్రవేటు వాహనాలు, ఆటోలు, తిరగక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బంద్ తో తాగు నీరు కూడా లభించక పోవడంతో మండుతున్న ఎండలో ప్రయాణికులు అతలాకుతలం అయ్యారు.