10-05-2025 02:37:31 AM
సరిహద్దు రాష్ట్రాల్లోని తెలంగాణ వాసుల కోసం ఏర్పాటు
హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న కాల్పుల నేపథ్యంలో దేశ సరిహద్దు రాష్ట్రాల్లో కేంద్రం హైఅలర్ట్ ప్రకటించింది. ఈ క్రమం లో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. సరిహద్దు రాష్ట్రాల్లోని తెలంగాణవాసుల కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.
అంతర్జాతీయ సరిహద్దులో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, సరిహద్దు రాష్ట్రాల్లో ప్రస్తుతం నివసిస్తున్న తెలంగాణవాసులకు సకాలంలో సహాయం, సమాచారం, సేవలను అందించేందుకు కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. నిరంతరాయంగా సేవలను నిర్ధారించడానికి కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తుందని ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు.
కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు
* ల్యాండ్లైన్ నంబర్ : 011-23380556,
* వందన, రెసిడెంట్ కమిషనర్ ప్రైవేట్ సెక్రటరీ అండ్ లైజన్ హెడ్ - 9871999044
* హైదర్ అలీ నఖ్వీ - రెసిడెంట్ కమిషనర్ వ్యక్తిగత సహాయకుడు - 991387500
* జీ రక్షిత్నాయక్ - లైజన్ ఆఫీసర్ - 9643723157,
* సీహెచ్ చక్రవర్తి పీఆర్వో - 9949351270