18 July, 2026 | 1:07 PM

Breaking News

Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

ఓటర్ల సవరణపై రగడ

02-08-2025 12:00 AM
  1. పట్టువీడని విపక్షాలు
  2. ఉభయ సభలు సోమవారానికి వాయిదా

న్యూఢిల్లీ, ఆగస్టు 1: బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)పై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మరోసారి రగడ మొదలైంది. నాలుగు రోజుల పాటు సజావుగా సాగిన పార్లమెంట్ శుక్రవారం మాత్రం ప్రతిపక్షాల నిరసనలతో స్తంభించింది. ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ అటు లోక్‌సభ.. ఇటు రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలు పలుమార్లు నిరసనలు వ్యక్తం చేయడంతో ఒక్క అంశంపై కూడా చర్చ జరగలేదు.

లోక్‌సభలో విపక్ష ఎంపీలు పలుమార్లు స్పీకర్ ఫోడియం వద్దకు వెళ్లి ఎస్‌ఐఆర్ రద్దు చేయాలని కోరుతూ నిరసన తెలిపారు. దీంతో స్పీ కర్ ఓంబిర్లా సభను సోమవారానికి వాయి దా వేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు పె ద్దల సభ కూడా సజావుగా సాగలేదు. రాజ్యసభలోనూ నిరసనలు వ్యక్తమవడంతో ఎ లాంటి చర్చ లేకుండానే సభ వాయిదా పడింది.