18 July, 2026 | 1:35 PM

Breaking News

కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కేటీఆర్‌ సవాల్‌   •   Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •  

రేపటి వరకు అమర్‌నాథ్ యాత్రకు బ్రేక్

02-08-2025 12:00 AM

రోడ్డు మరమ్మతులే కారణమన్న అధికారులు 

శ్రీనగర్, ఆగస్టు 1: భక్తుల భద్రతరిత్యా అమర్‌నాథ్ యాత్రను ఆగస్టు 3 వరకు రద్దు చేశారు. భక్తులు ప్రయాణించే రెండు మార్గాల్లో కొన్ని అత్యవసర మరమ్మతులు చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. భారీ వర్షాల వల్ల అమర్‌నాథ్ యాత్రికులు ప్రయాణించే దారి పాడయినట్టు పేర్కొన్నారు. శుక్రవారం ఉద యం నుంచి యాత్రికులెవర్నీ పహ ల్గాం మార్గంలో పంపట్లేదు.

బల్తాల్ మార్గంలో యాత్రను అనుమతిస్తున్నట్టు మొదట తెలిపినా.. భారీ వర్షాల వల్ల తర్వాత ఈ మార్గంలో కూడా యాత్రను రద్దు చేసినట్టు ప్రకటించారు. దీంతో భక్తులు జమ్మూ లోని భగవతినగర్ బేస్ క్యాంపులోనే ఉన్నారు. ‘ఇటీవల కురిసిన భారీ వ ర్షాల వల్ల మార్గం పాడయింది. మరమ్మతుల కోసం అమర్‌నాథ్ యాత్రను నిలిపివేశాం. యాత్రికుల భద్రతే మాకు ముఖ్యం’ అని కశ్మీర్ డివిజనల్ కమిషనర్ విజయ్ కుమా ర్ బిధూరి తెలిపారు.