calender_icon.png 27 September, 2025 | 11:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోక్సో కేసులో దోషికి రెండు జీవిత ఖైదులు

27-09-2025 12:57:23 AM

  1. రూ. 65వేల జరిమానా

తీర్పు చెప్పిన నల్లగొండ జిల్లా పోక్సో కోర్టు

జూన్ 13,2019లో చిట్యాల మండలం చిన్నకాపర్తిలో ఘటన

చిట్యాల, సెప్టెంబర్ 26(విజయ క్రాంతి): బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడగా అవమానం భరించలేక బాధితురాలు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో దోషికి నల్లగొండ జిల్లా పోక్సో కోర్టు రెండు జీవిత ఖైదులు, అలాగే రూ.65 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. వివరాలు.. నారాయణపురం మండలం సర్వేల్ గ్రామానికి చెందిన నిందితుడు కట్టెల సైదులు చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామానికి చెందిన పదో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డగా అవమానం భరించలేక బాధితురాలు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది.

ఈ ఘటనపై నిందితుడిపై జూన్ 13, 2019లో చిట్యాల పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. విచారణ అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా శుక్రవారం స్పెషల్ పోక్సో కోర్ట్టు నిందితుడిపై నమోదైన సెక్షన్ల ప్రకారం దోషిగా నిర్ధారించి రెండు జీవిత ఖైదులుగా శిక్ష, 65 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువడించిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు.

ఈ కేసులో సరైన సాక్ష్యధారాలు సేకరించి కోర్టులో చార్జిషీట్ దాఖలు సమర్పించి నిందితునికి శిక్ష పడేలా చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సీఐలు నరేందర్, శంకర్ రెడ్డి, ఎస్‌ఐ రాములు, అలాగే ప్రాసెక్యూషన్ కు సహకరించిన నల్గొండ డీఎస్పీ కె.శివరాం రెడ్డి, నార్కట్‌పల్లి సీఐ  నాగరాజు, చిట్యాల ఎస్‌ఐ రవి కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వేముల రంజిత్ కుమార్, సీడీఓ యాదయ్య, బరోసా సెంటర్ లీగల్ ఆఫీసర్ కె.కల్పన, లైజన్ అధికారులు పి.నరేందర్, ఎన్.మల్లికార్జున్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.