17 June, 2026 | 11:12 AM

Breaking News

మంత్రులు అడ్లూరి, వివేక్ కు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •   అవినీతి తిమింగలం.. నరహరిరావుకు 14 రోజుల రిమాండ్   •   పానీ పూరి తిన్న చిన్నారులు అస్వస్థత.. 10 మందికి పైగా ఆసుపత్రిలో చేరిక   •   పేరుకే ఎమ్మార్సీ భవనం.. వసతులు శూన్యం   •  

సద్దుల బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించిన కార్పొరేటర్ పుష్ప నాగేష్

30-09-2025 06:40 PM

రామచంద్రపురం: సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా సద్దుల బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున హంగు ఆర్భాటాలతో నిర్వహించారు. శ్రీనివాస్ నగర్ సండే మార్కెట్ ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లతో బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. పెద్ద ఎత్తున మహిళామణులు హాజరై బతుకమ్మలు ఆడుతూ, పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి వేడుకలు వైభవంగా సాగాయి. జడ్జిల పరిశీలనలో ఉత్తమ బతుకమ్మలను ఎంపిక చేసి బహుమతులు అందజేశారు.

మొదటి బహుమతి రూ.20,000 – ఊరెళ్ల లక్ష్మి

రెండవ బహుమతి రూ.15,000 – విజయలక్ష్మి

మూడవ బహుమతి రూ.10,000 – రాములమ్మ

అదనంగా ఐదు మంది విజేతలకు పట్టు చీరలు కన్సోలేషన్ ప్రైజెస్ గా అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.