24 April, 2026 | 6:14 PM

Breaking News

బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి   •   నిర్మల్‌లో ఆర్టీసీ కార్మికుల మౌన ర్యాలీ   •   కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: సర్పంచ్ మందుల నాగయ్య   •   ఇంటి ఆవరణ పరిశుభ్రతే... దోమల నివారణకు ఉత్తమ మార్గం   •   బిచ్కుంద మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యుల ఎంపిక నోటిఫికేషన్ విడుదల   •   అర్హులైన వారికి అక్రిడేషన్ కార్డులు: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్   •   ఆర్టీసీ కార్మికుడి మృతి ప్రభుత్వ హత్యగా భావించాలి   •   కాసిపేట 1A గని మ్యాన్ రైడింగ్ ప్రారంభించిన వేకటేశ్వర్లు, డైరెక్టర్ (ప్రాజెక్టు&ప్లానింగ్)   •   బొలెరో వాహనం ఢీకొని వ్యక్తి మృతి   •  

జోడు శ్రీనివాస్ అరెస్టుపై ఎస్పీ విచారణ జరపాలి

30-09-2025 07:24 PM

మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు డిమాండ్ 

కాటారం (విజయక్రాంతి): కాటారం మండల బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ జోడు శ్రీనివాస్ అరెస్టుపై భూపాలపల్లి జిల్లా ఎస్పీ విచారణ చేపట్టాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ డిమాండ్ చేశారు. మంగళవారం కాటారం మండల కేంద్రమైన గారేపల్లిలో గల అంబేద్కర్ చౌరస్తాలో కాటారం సబ్ డివిజన్ పరిధిలోని కాటారం, మహాదేవపూర్, మహా ముత్తారం, పలిమేల, మలహర్ మండలాల బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పుట్ట మధు మాట్లాడుతూ మంథని నియోజకవర్గంలో పోలీసులు ఖాకి దుస్తులు ధరించిన కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఖాకీ దుస్తులు ధరించిన పోలీసుల కంటే, అదే ఖాకీ దుస్తులు ధరించిన సఫాయి కార్మికులు నీతిగా, నిజాయితీగా పనిచేస్తున్నారని పేర్కొంటూ, అక్కడే ఉన్న సఫాయి కార్మికుడు వెంకట్ కి శాలువా కప్పి సన్మానం చేశారు. జోడు శ్రీనివాస్ ను అర్ధరాత్రి అరెస్టు చేయడం దారుణమని విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐదు మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళ నాయకులు పాల్గొన్నారు.