calender_icon.png 29 June, 2025 | 2:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోర్టు భవనంపై నుంచి దూకిన దంపతులు

29-06-2025 02:26:51 AM

  1. అక్కడికక్కడే భార్య మృతి

  2. పిల్లలు, భర్తకు తీవ్రగాయాలు

మెదక్ జిల్లా కేంద్రంలో ఘటన

మెదక్, జూన్ 28 (విజయక్రాంతి): మెదక్ జిల్లా కేంద్రంలోని కోర్టు భవనంపై నుంచి దంపతులు తమ ఇద్దరు పిల్లలతో సహా దూకేశారు. ఈ ఘటనలో అక్కడికక్కడే భార్య మృతిచెందగా, భర్త, పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. సిద్దిపేట జిల్లా పరిధి దౌల్తాబాద్ మండలానికి చెందిన రమ్య, నవీన్ దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతంలో దంపతుల మధ్య గొడవ జరగగా, రమ్య తల్లిగారింటిని నవీన్ తగలబెట్టాడు.

ఈ కేసులో నవీన్ బైక్, మొబైల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదుచేశారు. ఈ కేసు వ్యవహారంలో శనివారం మెదక్ జిల్లా కోర్టుకు చేరుకున్న నవీన్, రమ్య దంపతులు కోర్టు ప్రాంగణంలో గొడవపడ్డారు. తన బైక్, మొబైల్ ఇవ్వాలని నవీన్ కోరాడు. దీంతో వీరిమధ్య వివాదం ముదిరింది. పిల్లలతో సహా భార్యభర్తలిద్దరూ జిల్లా కోర్టు భవనంపై నుంచి దూకారు.

ఈ ఘటనలో రమ్య (27) అక్కడికక్కడే మరణించగా, ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. నవీన్‌కు సైతం తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం మెదక్‌లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.