calender_icon.png 29 June, 2025 | 8:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంత అమానుషం..!

29-06-2025 02:27:16 AM

తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు

  1. డబ్బు పంపకాల విషయంలో మనస్పర్థలు
  2. వరంగల్ జిల్లా కుంటుపల్లిలో దారుణం

మహబూబాబాద్/ వరంగల్, జూన్ 28 (విజయక్రాంతి): డబ్బు పంపకం విషయంలో మనస్పర్థలు రావడంతో కన్నతల్లిపైనే ఓ ప్రబుద్ధుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ అమానవీయ ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లిలో జరిగింది. కుంటపల్లి గ్రామానికి చెందిన ముత్తినేని సాంబయ్య, వినోద దంపతులకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. వారికి ఉన్న కొంత భూమి టెక్స్‌టైల్ పార్క్ కోసం ఇవ్వడంతో డబ్బులు వచ్చాయి.

ఇద్దరు కొడుకుల్లో ఓ కొడుకు గతంలోనే మరణించగా, మరో కొడుకు సతీష్ డబ్బులన్నీ తనకే ఇవ్వాలంటూ తల్లిదండ్రులతో గొడవపడుతున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం తల్లిదండ్రులతో మరోసారి సతీష్ గొడవకు దిగి తల్లి వినోదపై పెట్రో ల్ చల్లి నిప్పంటించాడు. దుర్ఘటనలో తల్లి వినోద 80 శాతం కాలిపోవడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స కోసం వినోదను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. తల్లిపై దాడికి తెగబడ్డ కొడుకు సతీష్ పరారీలో ఉన్నాడు. ఘటనపై సంగెం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

మహిళను వివస్త్రను చేసి జననాంగాలపై దాడి

  1. వివాహేతర సంబంధమే కారణం
  2. దాడి తర్వాత బాధితులు మిస్సింగ్
  3. హనుమకొండ జిల్లాలో ఘటన 

మహబూబాబాద్/వరంగల్, జూన్ 28 (విజయక్రాంతి): వివాహేతర సంబంధం నేపథ్యం లో ఓ మహిళను వివస్త్రను, అరగుండు గీసి, మర్మాంగంపై దాడి చేసిన ఘటన హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయలలో ఆలస్యంగా వెలుగుచూసింది. తాటికాయల గ్రామానికి చెందిన యువతితో ములుగు జిల్లా నల్లబెల్లి మండలం బోల్లోనిపల్లికి చెందిన యువకుడి వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలు సంతానం కాగా.. ఆ యువకుడు కొంతకాలంగా మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడు.

పదిహేను రోజుల క్రితం వీరిద్ద రూ గ్రామం నుంచి పరారయ్యారు. దీంతో బాధిత మహిళ తనపుట్టిల్లు తాటికాయలకు వచ్చి, బంధువులకు తన భర్త అక్రమ సంబంధం విషయం చెప్పింది. మహిళ బంధువులు పారిపోయిన, వారి ని ఈ నెల 22న తాటికాయల గ్రామానికి తీసుకొ చ్చి చెట్టుకుకట్టి చితకబాదారు. అక్రమ సంబంధం పెట్టుకున్నదనే ఆగ్రహంతో మహిళను వివస్త్రను చేసి మర్మాంగంలో జీడిగింజల రసం పోసి తీవ్రం గా గాయపరిచారు. ఎంత ప్రాధేయపడినా వినకుం డా అరగుండు గీశారు.

దాడి చేస్తున్న దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి గ్రూపుల్లో వైరల్ చేశారు. ఈ దాడి అనంతరం బాధితులిద్దరూ కనిపించకుం డాపోయారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు, న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు గ్రామానికి వెళ్లి సుమోటోగా కేసు నమోదుచేసి, దాడికి పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు.

వారిపై దాడిచేసిన ఘటనలను వాట్సాప్ గ్రూపుల నుంచి వెంటనే తొలగించాలని పోలీసులు పేర్కొన్నారు. అన్యాయం జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలే తప్ప, చట్టాన్ని  చేతు ల్లోకి తీసుకోవద్దని, ఈ ఘటనకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామ ని పోలీసులు హెచ్చరించారు. ఘటన తర్వాత అదృ శ్యమైన బాధితుల జాడ కోసం పోలీసులు వెతుకుతున్నారు.