calender_icon.png 30 June, 2025 | 8:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పులి దాడిలో ఆవు మృతి

12-03-2025 12:00:00 AM

కాటారం, మార్చి 11 (విజయక్రాంతి) : గత 20 రోజుల నుండి కాటారం, మహాదేవపూర్ మండలాల సరిహద్దు పరిసర ప్రాంతాల లో పెద్దపులి సంచరిస్తుండగా, తాజా గా కాటారం మం డలం రఘుపెళ్లిలో ఆవుపై పెద్దపులి దాడి చేసింది. సోమవారం సాయంత్రం రఘుపెళ్లి శివారు అటవీ ప్రాం తంలో ఆవుపై పెద్దపులి దాడి చేసి నట్లు అనుమానిస్తున్నారు. ఆవు మృతి చెందింది. దీంతో మంగళవారం ఉదయం రైతులు, గ్రామస్తులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఆవు మృతి చెందగా మనుషులకు కూడా అపాయాన్ని తలపెట్టే అవకాశం ఉందని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.