30-06-2025 08:11:21 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లి మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై సోమవారం ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షుడు రామగిరి మహేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్(Municipal Commissioner Thanniru Ramesh)కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఆత్మీయ సన్మానంతో పాటు పలు సమస్యలను విన్నవించారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు రామగిరి మహేష్ మాట్లాడుతూ... బెల్లంపల్లి పట్టణంలో బెల్లంపల్లి బస్తీ 19 వార్డులో రోడ్డు వెడల్పు పేరిట నిరుపేద ప్రజల ఇండ్లు, చిన్న చిన్న దుకాణాలు మున్సిపాలిటీ అధికారులు కూల్చివేశారనీ ఆరోపించారు.
ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా రోడ్డు వెడల్పుకి పూనుకోవడంతో నిరుపేదలు నష్టపోతున్నారన్నారు. ఈ చర్యను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇందులో దినసరి ఆదాయంతో బతికే నిరుపేద ప్రజలు చాలామంది ఉన్నారు. అధికారుల ముందుచూపులేనిమీతో ఆశ్రయం, ఉపాధినీ కోల్పోయారన్నారు. శాసనసభ్యులు వినోద్, కమిషనర్ ప్రభావిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, యువకులు పాల్గొన్నారు.