30-06-2025 08:08:04 PM
చిలుకూరు: చిలుకూరు మండలం(Chilkur Mandal) ఆచార్యుల గూడెం గ్రామంలో సోమవారం ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, నూతన అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. ఎమ్మార్పీఎస్, గ్రామ శాఖ అధ్యక్షులుగా బొడ్డుపల్లి, సైదులు, ఎంఎస్పి, గ్రామ శాఖ అధ్యక్షులుగా నెమ్మాది, లాజర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మల్లెపంగు, సూరిబాబు, అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టరేట్ అవార్డు గ్రహీత మొలుగూరి నాగరాజు హాజరయ్యారు.
ఆయన మాట్లాడుతూ... జులై ఏడో తారీఖున జరిగే ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రామాలలో దిమ్మెలు లేని చోట కొత్త దిమ్మెలను నిర్మించుకొని జెండాలు ఎగరవేసి ఘనంగా జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి, మండల నాయకులు సిద్దెల, శ్రీనివాస్, మాదిగ, ఎంజెఎఫ్, మండల ఉపాధ్యక్షులు మల్లెపంగు ఉపేందర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పుల్లయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.