29-06-2025 06:22:37 PM
టేకులపల్లి (విజయక్రాంతి): సిపిఐ టేకులపల్లి మండల 13వ మహాసభ సోమవారం టేకులపల్లిలో నిర్వహిస్తున్నట్లు సిపిఐ మండల కార్యదర్శి గుగులోత్ రామ్ చందర్(CPI Mandal Secretary Guguloth Ram Chander) తెలిపారు. ఈ మహాసభకు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao), సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె షాబీర్ పాషా, ఇల్లందు నియోజకవర్గ కార్యదర్శి కే సారయ్య, జిల్లా నాయకులు దేవరకొండ శంకర్ హాజరవుతారని తెలిపారు. సకాలంలో మండల కార్యవర్గ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు, శాఖ నూతన కార్యదర్శులు, కార్మికులు ప్రజా సంఘాల నాయకులు, మహిళ రైతులు, విద్యార్థి, యువజన, గిరిజన సమాఖ్య, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని మహాసభను విజయవంతం చేయాలని రామ్ చందర్ కోరారు.