1 September, 2026 | 11:11 PM

Breaking News

రామచంద్ర రావు హౌస్ అరెస్ట్ అప్రజాస్వామికం   •   అరైవ్ అలైవ్ స్పెషల్ డ్రైవ్ లో ప్రత్యేక తనిఖీలు   •   చీటింగ్, లూటింగ్ లో ఆరితేరిన రేవంత్ రెడ్డి సర్కార్   •   కేజీబీవీ హాస్టల్లో పరిశుభ్రతను పాటించాలి: అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్.   •   ప్రశ్నిస్తే దాడులు చేయడం హేయమైన చర్య   •   నేరేడుచర్లలోని అంజలి, పినాకిల్, శ్రీ చైతన్య, శ్రీవాణి పాఠశాలల్లో కరపత్ర ప్రచారం   •   తాడ్కోల్ గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ   •   మహిళా సంఘాల ఉపాధికి మార్గం.. యూనిఫాంలు త్వరితగతిన అందించాలి   •   పల్లగుట్టను ధ్వంసం చేస్తే అంధకారమే   •   నిరుపేదలకు సీఎం సహాయనిధి అండ   •  

నీటి పరిమితిని బట్టి పంటలు సాగు చేసుకోవాలి

13-03-2025 | 11:55pm

మండల వ్యవసాయ అధికారిని ఎస్ పద్మజ

మునుగోడు,(విజయక్రాంతి): వేసవి దృష్ట్యా నీటి పరిమితిని బట్టి పంటలను సాగు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ఎస్ పద్మజ అన్నారు. మండల పరిధిలోని పులిపలుపుల  గ్రామంలో  ఎండిపోతున్న వరి పంట పొలాలను ఆమె క్షేత్ర స్థాయి సందర్శన చేశారు. రైతులతో మాట్లాడుతూ ఎండిపోయిన బోర్ల ను ఇంకుడు గుంతల సాయంతో  రీచార్జ్ చేసుకోవాలి అని చెప్పారు. సేంద్రియ వ్యవసాయం చేయడం వలన భూమికి నీటి నిలువ సామర్థ్యం పెరుగుతుంది అని, విచ్చల విడిగా ఎరువులు , పురుగుల మందులు వాడినచో భూమిలో చౌడు పెరుగుతుందని చెప్పారు. రైతులు వరి పంట కు ప్రత్యామ్నాయంగా ఆరుతడి  పంటలైన పప్పు ధాన్యాలు,  మొక్కజొన్న ,కూరగాయలు సాగు చేసుకోవాలని సూచించారు. రైతులు బిందు సేద్యం లో ఆయిల్  పాము తోటల పెంపకం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  ఏఈఓ నర్సింహ్మ, రైతులు ఉన్నారు.