18-09-2025 12:22:18 AM
మేడ్చల్, సెప్టెంబర్ 17(విజయ క్రాంతి): మేడ్చల్ మండల ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి సన్మానించారు. బుధవారం మేడ్చల్ పట్టణంలోని డీసీసీ కార్యాలయంలో శాలువాలతో సన్మానించారు. ఈ సందర్బంగా హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు.
ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయాలన్నా, ప్రజా సమస్యలు ప్రభుత్వ దృష్టికి రావాలన్నా జర్నలిస్ట్ వల్లే అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మండల ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ అధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, జనరల్ సెక్రటరీ వెంకట్, ఉపాధ్యాక్షులు ఖాజా, మాజీ అధ్యక్షుల మహేష్, సభ్యులు గోపాల్ , విశ్వ, ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.