15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

అందరి అభిప్రాయాల తర్వాతే డిసిసి అధ్యక్షుని ఎన్నిక

18-10-2025 04:10 PM

ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసిసి ఎన్నికపై జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎఐసిసి పరిశీలకులు కర్ణాటక రాష్ట్ర హంగళ్ నియోజకవర్గ శాసనసభ్యులు మానే శ్రీనివాస్, ముఖ్య అతిథిగా భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ, అత్రం సుగుణ, మ్యాడమ్ బాలకృష్ణ, గ్రంథాలయం చైర్మన్ సత్తు మల్లేశం, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ చామల  మాట్లాడుతూ... జిల్లా అధ్యక్షుడి ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఎంపిక ఉంటుందన్నారు.