5 May, 2026 | 7:09 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

టెక్సాస్‎లో వరద బీభత్సం.. 104కి చేరిన మృతుల సంఖ్య

08-07-2025 10:14 AM

టెక్సాస్‌: అమెరికాలోని టెక్సాస్‌ను అతలాకుతలం చేసిన ఆకస్మిక వరదల్లో(Texas Floods) మరణించిన వారి సంఖ్య 104కి చేరింది. ఎంత మంది గల్లంతయ్యారని విషయం ఇంకా తెలియదని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో మరిన్ని వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో, బురదతో నిండిన నదీ తీరాల గుండా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. కేర్ కౌంటీలోనే 84 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ట్రావిస్, బెర్నెట్, విలియమ్స్ న్, కెండాల్, టామ్ గ్రీన్ కౌంటీల్లో 19 మంది మృతిచెందారు. మృతుల్లో 28 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. గ్వాడాలుపే నది ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గ్వాడలుపే నదీ తీరంలో ఉన్న శిక్షణా శిబిరాన్ని వరదనీరు ముంచెత్తింది.

టెక్సాస్ వరదల్లో చిక్కుకున్న 850 మందిని రక్షించాలని అధికారులు తెలిపారు. జూలై నాలుగో ప్రభుత్వ సెలవుదినమైన శుక్రవారం తెల్లవారుజామున కుండపోత వర్షాల కారణంగా గ్వాడాలుపే నది ఉప్పొంగి ప్రవహించిన కెర్ కౌంటీలో కనీసం 84 మంది బాధితులు - 56 మంది పెద్దలు, 28 మంది పిల్లలు మరణించారని బిబిసి నివేదించింది. 22 మంది పెద్దలు, 10 మంది పిల్లలను ఇంకా గుర్తించాల్సి ఉందని కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది. "ఈ ఊహించలేని విషాదాన్ని భరిస్తున్న మా కుటుంబాలతో పాటు మా హృదయాలు కూడా విరిగిపోయాయి" అని క్యాంప్ మిస్టిక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్యాంప్ మిస్టిక్ సహ యజమాని, డైరెక్టర్ అయిన 70 ఏళ్ల రిచర్డ్ ఈస్ట్‌ల్యాండ్, పిల్లలను కాపాడే ప్రయత్నంలో మరణించాడు.