08-07-2025 03:28:59 PM
నూతనకల్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ఆయా పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులే భాగస్వామ్యమని ఎంఈఓ రాములు నాయక్ అన్నారు మంగళవారం మండల మండల పరిధిలోని పెద నేమిల, లింగంపల్లి, మిర్యాల, మాచనపల్లి తదితర పాఠశాలలో ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ రాములు నాయక్ మాట్లాడుతూ... ప్రతి నెలలో ఒకరోజు ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల పురోగతి పాఠశాలల మౌలిక వసతులు విద్యార్థుల సామర్ధ్యాలు విద్యార్థుల ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలని ఆయన సూచించారు.