08-07-2025 03:16:58 PM
నూతనకల్,(విజయక్రాంతి): కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఏఐకేఎస్ ఆధ్వర్యంలో నిరసిస్తూ నేడు జరగబోయే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం మండల పరిధిలోని వెంకేపల్లి గ్రామంలో నిరసన తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కందాల శంకర్ రెడ్డి మాట్లాడుతూ... కార్మికులకు వెల్ఫేర్ బోర్డు హెల్త్ కార్డులు ప్రమాద బీమా కార్మికుల పిల్లలకు ఉచిత చదువు అందించాలని కోరారు.