4 July, 2026 | 9:32 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

పరిహారం అందించడంలో జాప్యం

25-07-2024 12:40 AM
  • మృతుల కుటుంబ సభ్యుల ఆందోళన

జయశంకర్ భూపాలపల్లి, జూలై 24 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు పరిహారం అందిస్తామని రాజీ కుదుర్చుకొని పరిహారం ఇవ్వడంలో జాప్యం చేసిన వ్యక్తి.. దుకాణం ఎదుట మృతుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. గతనెల కమలాపూర్ వద్ద బైక్‌ను కారు ఢీ కొట్టిన సంఘటనలో కమలాపూర్‌కు చెందిన ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనకు కారణమైన మణికంఠ ట్రేడర్స్ యజమాని బందం మహేష్‌రెడ్డి మృతుల కుటుంబాలకు పరిహారం అందించేందుకు ఒప్పందం కుదుర్చకుని రాజీపడ్డారు.

అయితే సాయం అందించడంలో ఆలస్యం చేయడంతో ఆగ్రహించిన మృతుల కుటుంబ సభ్యులు భూపాలపల్లి లోని అతడి దుకాణం ఎదుట బుధవారం ఆందోళనకు దిగారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని శాంతింపజేసే ప్రయత్నం చేసినప్పటికీ.. తమకు నష్టపరిహారం ఇచ్చేవరకు ఆందోళన విరమించమని భీష్మించుకుని కూర్చోవడంతో సదరు వ్యక్తి ఒప్పుకున్న మేరకు ఆర్థికసాయం చెల్లించేందుకు ముందుకు రావడంతో ఆందోళన సద్దుమణిగింది.