24 March, 2026 | 7:56 PM

Breaking News

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన   •   జన గణనను పకడ్బందీగా పూర్తి చేయాలి   •   ప్రభుత్వానికి నాణ్యమైన సమాచారం అందించేలా కృషి చేయాలి   •   ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు   •   సంత నిర్వాహణ వేలంలో పెరిగిన ఆదాయం 5.02 శాతం మాత్రమే   •   జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం   •   ద్వారకుంటలో సిసి రోడ్డు శంకుస్థాపన: సర్పంచ్ పాలకి సురేష్   •   ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశ్యం   •   కోనరావుపేట 10వ వార్డ్‌లో పారిశుధ్య సమస్యలు   •   కోదండరామాలయం పరిసరాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు   •  

పరిహారం అందించడంలో జాప్యం

25-07-2024 12:40 AM
  • మృతుల కుటుంబ సభ్యుల ఆందోళన

జయశంకర్ భూపాలపల్లి, జూలై 24 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు పరిహారం అందిస్తామని రాజీ కుదుర్చుకొని పరిహారం ఇవ్వడంలో జాప్యం చేసిన వ్యక్తి.. దుకాణం ఎదుట మృతుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. గతనెల కమలాపూర్ వద్ద బైక్‌ను కారు ఢీ కొట్టిన సంఘటనలో కమలాపూర్‌కు చెందిన ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనకు కారణమైన మణికంఠ ట్రేడర్స్ యజమాని బందం మహేష్‌రెడ్డి మృతుల కుటుంబాలకు పరిహారం అందించేందుకు ఒప్పందం కుదుర్చకుని రాజీపడ్డారు.

అయితే సాయం అందించడంలో ఆలస్యం చేయడంతో ఆగ్రహించిన మృతుల కుటుంబ సభ్యులు భూపాలపల్లి లోని అతడి దుకాణం ఎదుట బుధవారం ఆందోళనకు దిగారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని శాంతింపజేసే ప్రయత్నం చేసినప్పటికీ.. తమకు నష్టపరిహారం ఇచ్చేవరకు ఆందోళన విరమించమని భీష్మించుకుని కూర్చోవడంతో సదరు వ్యక్తి ఒప్పుకున్న మేరకు ఆర్థికసాయం చెల్లించేందుకు ముందుకు రావడంతో ఆందోళన సద్దుమణిగింది.