15 April, 2026 | 1:12 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

వారానికి ఐదు రోజులు పని దినాలు అమలు చేయాలి

27-01-2026 08:57 PM

  -మేనేజర్ అలివేలు

మిర్యాలగూడ,(విజయక్రాంతి): రిజర్వు బ్యాంకు మార్గ నిర్దేశాల మేరకు పనిచేస్తున్న వివిధ రంగాల బ్యాంకులలో వారానికి ఐదు రోజుల పని దినాలను అమలు చేయాలని నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మిర్యాలగూడ బ్రాంచ్ మేనేజర్ కందుకూరి అలివేలు అన్నారు. మంగళవారం బ్యాంకు ఐక్య కార్యాచరణ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఒక రోజు సమ్మె చేపట్టారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలందించేందుకు బ్యాంకు సిబ్బందిపై పని భారం తగ్గించాలని, అందులో భాగంగానే తమ న్యాయమైన డిమాండ్ల సాధన కొరకు సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది లక్ష్మీప్రసాద్, కరుణాకర్, కోటేశ్వరరావు, పి. లక్ష్మణ్,వి.ఆనంద్, శాంతిలత, మంజులత, లక్ష్మీ ప్రియ, భూదేవి, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.