12-12-2025 12:00:00 AM
ఘట్కేసర్, డిసెంబర్ 11 (విజయక్రాంతి) : పోచారం రెవిన్యూ పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు గురువారం కూల్చి వేయించారు. పోచారం రెవిన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 35 లో అక్రమంగా నిర్మించిన షెడ్ల నిర్మాణాలను రెవెన్యూ అధికారులు జెసిబి తో కూల్చి వేయించారు. ప్రభుత్వ స్థలాలలో అక్రమం గా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు.