16 April, 2026 | 12:06 PM

Breaking News

వీధి కుక్కల దాడి.. మృత్యువుతో పోరాడి— 15 రోజుల తర్వాత బాలుడు మృతి   •   కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •  

మాజీ ప్రభుత్వ విప్ ని కలిసిన దోమకొండ నూతన ఉప సర్పంచ్, వార్డు సభ్యులు

20-12-2025 04:51 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): ఇటీవల జరిగిన స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ నూతన ఉప సర్పంచ్ , వార్డు సభ్యులుగా ఎన్నికైన సభ్యులు శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచ్ బొమ్మెర శ్రీనివాసు, వార్డు సభ్యులు గజవాడ శ్రీకాంత్, పాలకుర్తి శేఖర్, బీసు సతీష్ కుమార్, ఐరెని లత రాజేందర్, బొబ్బసాని రమ్య సుధాకర్ ను శాలువాలు కప్పి పుష్ప గుచ్చములతో సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించి  గ్రామ అభివృద్ధికి తోడ్పాటును అందించాలన్నారు . ఇదే స్పూర్తితో రానున్న ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అన్ని స్థానలలో గెలుచుకునే విధంగా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొరెడ్డి కిషన్ రెడ్డి, నాయకులు కాగంటి నాగరాజు, కూర చంద్రం, బొమ్మెర గంగాధర్ ,కొండ శ్రీనివాస్ ,అనుమాల అశోక్ ,చెన్నుగారి నర్సింలు, కుమ్మరి విజయ్, నిమ్మ రాజనర్సు ,బిసుశివ తదితరులు పాల్గొన్నారు