17 April, 2026 | 2:33 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు

20-12-2025 05:39 PM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రజాపాలన కొనసాగుతుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు . శనివారం కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో రూ.50 లక్షలతో ఐదు పాఠశాలలో చేపడుతున్న అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం పురపాలక పరిధిలో మంజూరైన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు ధ్రువపత్రాలు అందించి మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడం జరుగుతుందని అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అన్నారు. ఎన్నడూ లేని విధంగా విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యత , ఇవ్వడం జరుగుతుందని వెనుకబడిన తరగతుల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పొల్యూషన్ బోర్డ్ సభ్యులు బాలాజీ సింగ్, మున్సిపల్ కమిషనర్ షేక్ మహబూబ్, నాయకులు ఆనంద్ కుమార్, విజయకుమార్ రెడ్డి, రమాకాంత్, శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు