6 May, 2026 | 7:58 PM

Breaking News

జిల్లా కోర్టును సందర్శించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పులి సులోచనరావుకు అభినందనల వెల్లువ   •   పెళ్లి రోజు సందర్భంగా ఎల్లమ్మ, మహంకాళి అమ్మవార్లను దర్శించిన తలసాని దంపతులు   •   జవహర్ నగర్‌లో గృహిణి అదృశ్యం   •   గిరిజన ప్రాంతాలలో అమలు చేస్తున్న కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలి   •   శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవానికి ఆహ్వానం అందజేత   •   వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన సదస్సు   •   ఆర్టీసీ సూపర్వైజర్ కాలనీలో ఘనంగా అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన   •   నాగోల్‌లో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనుల వేగం పెంచాలి   •   పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి - సిపిఐ   •  

క్రీడల్లో నైపుణ్యాలు పెంపొందించుకోవాలి

30-09-2025 12:39 AM

డీసీసీ ఉపాధ్యక్షుడు దరూరి యోగానంద చార్యులు 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),సెప్టెంబర్29: యువత క్రీడల్లో నైపుణ్యాలను మరింత పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, హైకోర్టు అడ్వకేట్ దరూరి యోగానందచార్యులు అన్నారు.బతుకమ్మ,దసరా పండుగలను పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్ లో సోమవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో (సోమ,మంగళ,బుధవారం)మూడు రోజులపాటు క్రీడలు కొనసాగనున్నట్లు చెప్పారు.క్రీడల్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతిగా రూ.30,016ద్వితీయ బహుమతిగా రూ.20,016 తృతీయ బహుమతి రూ.15,016 చతుర్ధ బహుమతిగా రూ.10,016 లను అందజేయనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నర్సింగ శ్రీనివాస్ గౌడ్,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శిగ నసీర్ గౌడ్,ఉపాధ్యక్షులు పెసర సతీష్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు నర్సింగ కృష్ణమూర్తి,వల్లాల ఖాజా యాదవ్,లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం డైరెక్టర్లు బీరెల్లి శ్రీధర్ రెడ్డి,జేరిపోతుల సోమయ్య,నాయకులు బొర్ర గిరిబాబు,బింగి కృష్ణమూర్తి,వేములకొండ ఉప్పలయ్య,మామిడి అనిల్,పీడీలు,క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.