03-06-2025 12:51:59 AM
హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): కిటాక్యూషూ నగర అభివృద్ధి తెలంగాణ రైజింగ్కు సరిపోయేలా ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. హైదరా బాద్, కిటాక్యూషూ మధ్య విమాన అనుసంధానత కోసం ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.
తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకులకు హైదరాబాద్కు వచ్చిన జపాన్ దేశంలోని కిటాక్యూషూ సిటీ మేయర్ కజుహిసా టకేచీ ప్రతినిధి బృందానికి సీఎం రేవంత్రెడ్డి సోమవారం ఐటీసీ కాకతీయ హోటల్లో స్వాగ తం పలికి, మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవరం రోజున రాష్ట్ర భవిష్యత్తు కోసం కొత్త ప్రపంచ భాగస్వామ్యులను ఏర్పరచుకోవటం ద్వారా రాష్ట్ర పురోగతిని ముందుకు తీసుకెళ్తున్నామని సీఎం పేర్కొన్నారు.
ఏప్రిల్లో తాను జపాన్ దేశం సందర్శించినప్పుడు అక్కడి అభివృద్ధిని, మీ పనితనాన్ని చూశానని తెలిపారు. కిటాక్యూషూ నగరం ఏకో మోడల్తో చాలా ప్రేరణ పొందానని తెలిపారు. మీరిచ్చిన ప్రేరణతో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో అలాంటి నమునాను అభివృద్ధి చేసేం దుకు అనేక జపనీస్ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందని చెప్పా రు.
తెలంగాణ, కిటాక్యూషూ మధ్య సహకార ఒప్పందంపై సంతకం చేయడం పట్ల సంతోషంగా ఉందని, ఈ ఒప్పందం సమ్మిళిత ఆర్థిక వ్యవస్థ, సున్నా ఉద్గారాలు, పట్టణ ఆవిష్కరణలలో సహకారానికి పునాది కానున్నదని సీఎం అభిప్రాయపడ్డారు. మూసీ నది అభివృద్ధి, పునరుజ్జీవన ప్రాజెక్టుపై తాము ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు వివరించారు. తెలంగాణ యువతలో నైపు ణ్యాన్ని వృద్ధి చేయడమే తమ ప్రాధాన్యమని సీఎం స్పష్టం చేశారు.
తెలంగాణ యువత, విద్యార్థులు జపనీస్ భాష నేర్చుకోవాలనుకుంటున్నారని, జపాన్లో ఉద్యోగ అవకా శాల కోసం అన్వేషిస్తున్నారని పేర్కొన్నారు. మీ సాయంతో ఇక్కడి యువతకు జపనీస్ భాషను నేర్పించాలని భావిస్తున్నట్టు తెలిపారు. మన స్వేహం సుదీర్ఘంగా, అద్భు తంగా ఉండాలని కోరుకుంటున్నట్టు సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.