calender_icon.png 4 June, 2025 | 4:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధిలో పరుగులు తీస్తున్న ములుగు జిల్లా

03-06-2025 12:52:24 AM

- అర్హులందరికీ సంక్షేమ ఫలాలు.మిస్ వరల్డ్ సుందరీమణులను ఆకట్టుకున్న రామప్ప శిల్పాలు.జిల్లా అధికారులు చేస్తున్న సేవలను మరవలేము.

- 12వ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క

విజయక్రాంతి,ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా అభివృద్ధి పథంలో పరుగులు తీస్తున్నదని,జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్న అధికారుల సేవలను ఎన్నటికీ మర్చిపోలేమని రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.

రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ ఫలాలను అర్హులందరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సోమవారం 12వ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు తంగడి మైదానంలో జరిగిన కార్యక్రమంలో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్,జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవి చందర్,అదనపు కలెక్టర్లు మహేందర్ జి,సంపత్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం పోలీసు వందనము స్వీకరించారు. 

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా ప్రజలను ఉద్దేశించి సీతక్క మాట్లాడుతూ పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన,ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్ లక్ష్యాలను సాధించడానికి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పేరుతో ముందుకు సాగుతున్నదని,ఈ డివిజన్ డాక్యుమెంట్ భవిష్యత్తు తెలంగాణకు భగవద్గీతగా మారి తెలంగాణ రాష్ట్ర రూపు రేఖలు మార్చేస్తుందని అభిప్రాయపడ్డారు. 

  అటవీ శాఖ ద్వారా జిల్లాలో బ్లాక్ బెర్రీ ఐలాండ్ అరణ్య క్యాంప్,లక్నవరం జంగిల్ క్యాంప్,ట్రెక్కింగ్ మార్గాలు,బోగత జలపాతం,రాక్షస గుహలతో పాటు పలుచోట పర్యాటక ప్రాంతాలను ఏర్పాటు చేసి దేశ విదేశాలను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దడం జరిగిందని వివరించారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని, రానున్న రోజులలో జిల్లా అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తామని సీతక్క తెలిపారు.ఈకార్యక్రమంలో జిల్లా అధికారులు,ప్రజా ప్రతినిధులు,ప్రజలు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

హనుమకొండ జిల్లా పోలీసు పెరేడ్ గ్రౌండ్స్ వద్ద..

హనుమకొండ, జూన్ 2 (విజయ క్రాంతి): హనుమకొండ జిల్లా పోలీసు పెరేడ్ గ్రౌండ్స్ నందు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జాతీయ పతాకావిష్కరణ గావించి, పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. తదుపరి ప్రజలను ఉద్దేశించి జిల్లా ప్రగతి గురించి వివరించారు. వివిధ ప్రభుత్వ శాఖల  ద్వారా అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలను తెలియజేస్తూ ప్రదర్శించిన శకటాలను తిలకించారు. 

అనంతరం చిన్నారులచే ప్రదర్శించబడిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. అనంతరం ఆదాలత్ జంక్షన్ లోని అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, నగర సిపి సన్ ప్రీత్ సింగ్, జిడబ్ల్యూఎంసి కమీషనర్ అశ్విని తానాజీ వాఖడే, ఇతర జిల్లా అధికారులు, తదితరులు పాల్గోన్నారు.

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో...

సోమవారం ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కలెక్టరేట్ ప్రాంగణంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య జాతీయ పథకాన్ని ఎగురవేశారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. త్రివర్ణ పథకం ఆవిష్కరణంతరం కలెక్టర్ మాట్లాడుతూ స్వరాష్ట్రం సాధించేందుకు పోరాడిన అమరువీరుల త్యాగాలను స్మరించుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదగా స్కౌట్స్, గైడ్స్ కు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్లు వై.వి గణేష్, మేన శ్రీను, హనుమకొండ రెవెన్యూ డివిజన్ అధికారి రమేష్ రాథోడ్, జిల్లా కోశాధికారి శ్రీనివాస్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

అనంతరం ఇందిరామ్మ ఇండ్లు - ఒంటరి మహిళలు, వితంతువు, పిడబ్ల్యుడి (15) సభ్యులకు,  భు భారతి ప్రొసీడింగ్స్ (10) మంది లబ్ధిదారులకు,  ఫౌండేషన్ విత్తన సీడ్స్ మినీ కిట్స్ పంపిణీ, SHG మహిళా సమూహాల జంబో చెక్కుల పంపిణీ,  TGPSC- ప్రశంసల పంపిణీ చేశారు.ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.ఎస్ పి శబరిష్,ఏఎస్పీ శివం ఉపాధ్యాయ,అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్ జి,సంపత్ రావు,ఏఆర్ అదనపు ఎస్ పి సదానందం,ఆర్డీఓ వెంకటేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్,వివిధ శాఖల అధికారులు,పుర ప్రముఖులు పాల్గొన్నారు.

డోర్నకల్ లో ఆవిర్భావ వివాదం 

మహబూబాబాద్, జూన్ 2 (విజయ క్రాంతి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గాలు కయ్యానికి కాలు దువ్వడంతో ఇరువర్గాల మధ్య ఆవిర్భావ వివాదం చోటు చేసుకుంది. దీనితో ఇరువు వర్గాలను శాంతింప చేయడానికి పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది.  డోర్నకల్ పట్టణంలో గాంధీ సెంటర్ వద్ద ఉన్న బీఆర్‌ఎస్ జండా గద్దె సమీపంలోనే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆవిర్భావ వేడుకల కోసం ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం నుండి బీఆర్‌ఎస్ శ్రేణులు భారీ ర్యాలీగా అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నించగా, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున మోహరించి అడ్డుకున్నారు. దీనితో ఎవరికి వారు వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడడంతో సిఐ రాజేష్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ తన అనుచరులతో రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటుచేసిన జండా గద్దే వద్ద పతాకావిష్కరణ చేశారు. 

వడ్డీతో సహా మూల్యం చెల్లించక తప్పదు

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాను ఎమ్మెల్యే విజయం సాధించి, మంత్రిని ని కూడా కావడం తగ్గమని, అప్పుడు ఇంతకు ఇంత మూల్యం చెల్లించక తప్పదని ప్రత్యర్థులను మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ హెచ్చరించారు.

భీమదేవరపల్లి..

భీమదేవరపల్లి జూన్ 2 ( విజయ క్రాంతి) తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం మండలంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో జాతీయ జెండాను ఆవిష్కరించి అమరవీరులను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో అమరులైన వీరులను తలుచుకుంటూ ఘనంగా నివాళులర్పించారు.

ముల్కనూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద వివిధ పార్టీల నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించడంతోపాటు వారి పార్టీ జెండాలను ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వీరేశం, తహసిల్దార్ రాజేష్, ఎంఈఓ సునీత, ముల్కనూర్ ఎస్త్స్ర సాయిబాబు,ఈవో కిషన్ రావు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మానుకోటలో..

మహబూబాబాద్, జూన్ 2 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్క రించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అద్వై త్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ బ్రహ్మచారి, ఎస్పి సుధీర్ రామ్నాథ్ కేకన్ , ఇతర జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

డిసిసి కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, తెలంగాణ ఆవిర్భావం సోనియా గాంధీతోనే సాధ్యమైందని, సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి తెలంగాణ అమరవీరులకు ఘనం గా నివాళులు అర్పించారు.  ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్, డివైసిసి అధ్యక్షుడు సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే భారత రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయంలో అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్, మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ మర్రి రంగారావు పాల్గొన్నారు.