03-06-2025 12:51:37 AM
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలదారు కేశవరావు
మెదక్, జూన్ 2(విజయక్రాంతి): మెదక్ జిల్లా సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ ప్రాంగణంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా . ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలదారు కే. కేశవరావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, గ్రంథాలయ చైర్మన్ చిలుమల సుహాసిని రెడ్డి,హౌసింగ్ పీడీ మాణిక్యం, జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ తో కలిసి రైతులకు,విత్తనాలు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరి ప్రొసీడింగ్స్ అందజేశారు.
ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం కార్యక్రమాన్నిప్రారంభించడం జరిగిందన్నారు. నాణ్యమైన విత్తనంతో సమృద్ధిగా పంటలు పండించి తద్వారా దేశ సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలనే మహోత్తర లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఒక వినూత్న కార్యక్రమం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో 8 మంది రైతులకు విత్తన కిట్లు అందజేయడం జరిగింది.
విత్తుకొద్దీ పంట అనే నానుడిని నిజం చేస్తూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ ప్రారంబించింది.మెదక్ జిల్లాలోని 21 మండలాల్లోని ప్రతి రెవెన్యూ గ్రామానికి నాణ్యమైన వరి పెసర విత్తనాలు పంపిణీ చేశాయి. కార్యక్రమం ఉద్దేశం , అమలు ఈ విత్తనాల పంపిణీ కేవలం విత్తనాలు ఇవ్వడమే కాదు, దీని వెనుక పటిష్టమైన ప్రణాళిక ఉందని అన్నారు.
ప్రతి రెవెన్యూ గ్రామంలో నుండి ముగ్గురు రైతులను ఎంపిక చేసి వారికి విత్తనాలను అందజేయడం జరుగుతుంది. తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరి ఉత్తర్వుల ప్రొసీడింగ్స్ పంపిణీ చేశామని చెప్పారు. ఈరోజునుండి 06వ తేదీ వరకు లబ్ధిదారులకు వారి ఇంటికి ప్రొసీడింగ్స్ అందజేయబడతాయన్నారు.
ప్రొసీడింగ్స్ పొందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు వెంటనే ఇండ్లు మొదలు పెట్టుకుని త్వరితగతిన పూర్తి చేసుకున్నట్లయితే డబ్బులు మంజూరు అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి శాస్త్రవేత్త రాహుల్ విశ్వకర్మ, వ్యవసాయ అధికారులు రైతులుపాల్గొన్నారు.నాణ్యమైన విత్తనం - రైతన్నకు నేస్తం