15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఆస్ట్రేలియా కాల్పుల నిందితుడిపై డీజీపీ కార్యాలయం ప్రకటన

16-12-2025 06:28 PM

హైదరాబాద్: ఆస్ట్రేలియా కాల్పుల ఘటన నిందితుడు సాజిద్ అక్రమ్ పై డీజీపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. సాజిద్ హైదరాబాద్ వాడేనని, ఆయన బీకామ్ చదివి 27 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లాడని డీజీపీ పేర్కొన్నారు. యూరోపియన్ యువతి వెనెరా గ్రోసోను సాజిద్ ఆక్రమ్ పెళ్లి చేసుకున్నాడని, ఆస్ట్రేలియాకు వలస వెళ్లిన నిందితుడు భారత్ కు ఆరుసార్లు వచ్చాడని తెలిపారు.

సాజిద్ అక్రమ్ ఇప్పటికీ భారత్ పాస్ పోర్టునే వినియోగిస్తున్నాడని, తనకు నవీద్ అక్రమ్ అనే కుమారుడిలో పాటు కుమార్తె ఉందని డీజీపీ వెల్లడించింది. సాజిద్ హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఎలాంటి నేర చరిత్ర లేదని, హైదరాబాద్ లో ఉన్న తన కుటుంబీకులను విచారించినప్పుడు ఉగ్రవాద సంబంధంపై తమకేమీ తెలియదన్నారు. ఇద్దరు తండ్రి కొడుకులు ఆదివారం సిడ్నీ బీచ్ లో పర్యాటకులపై జరిపిన కాల్పుల్లో 15 మంది యూదులు మరణించారు.