27 June, 2026 | 7:26 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

వ్యాధులు ప్రబలకుండా చూడాలి..

25-07-2025 12:00 AM

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని దేమికలాన్ గ్రామం ఎస్సీ కాలనీలో అపారిశుధ్యం కారణంగా పలువురు అనారోగ్యంపాలయ్యారు. మరికొందరు వాంతులు, విరేచనాల బారిన పడి ఇబ్బంది పడుతున్నారు. కాలనీలో డయేరియా ప్రబలడంతో ఇద్దరు మృతిచెందారు. చనిపోయిన వారిద్దరూ తండ్రీ కొడుకులే. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతిచెందడంతో కాలనీవాసులు ఆందోళనకు గురవతున్నారు.

ప్రస్తుతం కాలనీవ్యాప్తంగా సుమారు 30 మంది మంచంపట్టారు. వీరిలో తీవ్ర అస్వస్థతకు గురైన ఎనిమిది మంది కామారెడ్డి జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాలనీవాసులు 10 రోజులుగా డయేరియా విజృంభించడంతో కాలనీవాసులు ఆందోళనకు గురవుతున్నారు. పదిరోజుల్లో వైద్యారోగ్యశాఖ ఒకే ఒకరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించింది.

వైద్యులు పలువురి పరీక్షించి మెడిసిన్ అందించారు. వైద్యారోగ్యశాఖ మరోసారి వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరుతు న్నారు. అలాగే కాలనీలో క్రమం తప్పకుండా పారిశుధ్య చర్యలు చేపట్టాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాలనీలో ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించాలంటున్నారు.

                              దినేశ్, కామారెడ్డి