2 September, 2026 | 8:37 PM

Breaking News

రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •   ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది రేవంత్ రెడ్డి.. ఖబర్దార్   •  

అధికారుల ఆదేశాలు బేఖాతరు !

01-09-2025 | 12:07am

* సీజ్ చేసిన దాబాను తెరిచిన యాజమాన్యం

* యథేచ్ఛగా వ్యాపారం

కొండాపూర్, ఆగస్టు 31 : గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా అక్రమంగా వ్యాపారం చేస్తున్న కొం డాపూర్ మండల పరిధిలోని గిర్మాపూర్ గ్రామ శివారులో ఉన్న కింగ్స్ దాబాను శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారులతో పాటు మండల పంచాయతీ అధికారులు సిజ్ చేయ గా, సీజ్ చేసిన 24 గంటలు గడవకముందే దాబా యజమాన్యం పంచాయతీ అధికారులను ఏమాత్రం లెక్కచేయకుండా దాబాను తిరిగి ప్రారంభించారు. 

దీంతో అధికారుల ఆదేశాలకు ఏ మాత్రం అక్రమార్కులకు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. దాబా యజమానులు అనుమతులకు విరుద్దంగా వ్యాపారం నిర్వహిస్తున్నారని ఇటీవల విజయక్రాంతి ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించి సీజ్ చేయడం జరిగింది. కానీ అధికారుల ఆదేశాలు బేఖాతరు చేస్తూ దాబా యాజమాన్యం యథేచ్ఛగా నడిపించడం అధికారుల పనితీరుకు నిదర్శనంగా కనిపిస్తోంది.

అయితే వ్యాపారుల వెనుక పంచాయతీ అధికారుల అండదండలు ఉన్నాయని, నామమాత్రంగా నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు ఈ విషయంలో కఠిన చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేయడమే కాకుండా గిర్మాపూర్ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.