08-10-2025 06:18:50 PM
ఆర్మూర్ (విజయక్రాంతి): ఆర్మూర్ పట్టణ కేంద్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ శాసన సభ్యులు జీవన్ రెడ్డి సూచన మేరకు ఆర్మూర్ పట్టణ భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు పూజ నరేంధర్, మాజీ వైస్ ఎంపీపీ గంగాధర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అమలు కాని 420 హామీలను ఇచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న ఇప్పటికీ హామీలను నెరవేర్చకుండా బాకీ పడ్డ మొత్తాన్ని ఒకే దఫాలో చెల్లించాలని అర్హులందరికీ 24 నెలల బాకీలను చెల్లించాలని డిమాండ్ చేశారు.
లేకపోతే ప్రజలు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుతారని కాంగ్రెస్ పాలన విధానంతో రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఇప్పటికైనా ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్వసమాజ్ అధ్యక్షుడు సుంకరి రవి, ఆర్మూర్ పిఏసీఎస్ వైస్ చైర్మన్ నర్మే నవీన్, యువజన అధ్యక్షుడు గుంజల పృద్వి రాజ్, అగ్గు క్రాంతి, ఎస్సి సెల్ టౌన్ అధ్యక్షుడు జన్నపల్లి రంజిత్, నాయకులు మీరా శ్రవణ్, ఇందూర్ విజయ్, మైనార్టీ నాయకులు అర్షద్, లతీఫ్, రహ్మద్ భాయ్, శైఫ్, చరణ్, ప్రితం, శైఫ్ తదితరులు పాల్గొన్నారు.