16 April, 2026 | 8:17 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

పోలీసుల ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ

27-10-2025 11:41 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్:(విజయక్రాంతి): పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా వాంకిడి పోలీస్ స్టేషన్ పరిధిలోని సరికేపల్లి గ్రామంలో సోమవారం 30 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మహేందర్ మాట్లాడుతూ పోలీస్ అమరవీరులు ప్రజల భద్రత కోసం ప్రాణాలను అర్పించారని వారి త్యాగాన్ని స్మరించుకుంటూ, సమాజంలోని బలహీన వర్గాలకు సహాయం చేయడం ద్వారా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.పోలీసు శాఖ కేవలం చట్టం అమలు చేయడమే కాకుండా, ప్రజల మధ్య సానుభూతిని పెంచే కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోందని  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  పోలీస్ స్టేషన్    సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.