21-01-2026 12:09:09 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కేరమేరి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్' చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేరమేరి సర్పంచ్ ఆనంద్ రావు, నిషాని సర్పంచ్ అంబారావు, మెట్ట పిప్పిరి సర్పంచ్ కొద్దు, అగర్ వాడ సర్పంచ్ రోజా, ఇందాపూర్ సర్పంచ్ బుచ్చయ్య ,మాజీ ఎంపీపీ మోతిరామ్, మాజీ వైస్ ఎంపీపీ కలాం,మండల అధ్యక్షులు రాథోడ్ అంబాజీ,నాయకులు యునుస్, రూపులల్, కంబాల వినేష్, నిషార్, శ్రీనివాస్,అధికారులు పాల్గొన్నారు.