14-06-2025 12:00:00 AM
రాజాపూర్ జూన్ 13: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా ఇస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు జనంపల్లి శశికళ రెడ్డి అన్నారు. శుక్ర వారం మండల కేంద్రంలోని తహసిల్దార్ కా ర్యాలయంలో తహసీల్దార్ రాధాకృష్ణ సమక్షంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి ,షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని అ న్నారు.
పేదల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శేఖర్ గౌడ్ ,గోవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ నాయక్,విక్రమ్ రెడ్డి,నసిర్ బేగ్, రమణ,రమేశ్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.