calender_icon.png 15 June, 2025 | 6:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడీడు పిల్లలు బడిలోనే ఉండాలే

14-06-2025 12:00:00 AM

  1. రంగారెడ్డి జిల్లా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి పి. శ్రీవాణి

నేరాల బాట పట్టకుండా చూడాల్సింది బాధ్యత తల్లిదండ్రులదే

ఎల్బీనగర్ అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు

అబ్దుల్లాపూర్‌మెట్, జూన్ 13: బడీడు పిల్లలు బడిలోనే ఉండాలని.. పనిలో ఉండొద్దని రంగారె డ్డి జిల్లా ప్రిన్సిపల్ సీనియర్ సివి ల్ జడ్జి పి.శ్రీవాణి అన్నారు. రం గారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సౌజన్యంతో అబ్దుల్లా పూ ర్ మెట్ మండలం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్స వం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి పి. శ్రీవాణి, ఎల్బీనగర్ అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీవాణి మాట్లాడుతూ.. బడీడు పిల్లలు బడిలోనే ఉండాలని.. పనిలో ఉండొద్దన్నారు. పిల్లలు ఖచ్చితంగా ప్రాఠశాలలకు వెళ్లి చుదువుకోవాల ని.. ఎవ్వరైనా పనిలో పెట్టుకుంటే చట్టపరమైన శిక్ష తప్పదని హెచ్చరించారు.

ఎల్బీనగర్ అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు బడి మాని వేసి కార్మి కులుగా చేరడం వలన వ్యసనాలకు బారిన పడి.. అనేక నేరాలు పాల్పడుతున్నారని.. వీరిని సరి చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని సూచించారు. అలాగే ఎవ్వరైనా చిన్న పిల్లలను పని లో పెట్టుకుంటే స్థానిక పోలీస్‌స్టేషన్, 100 డైలీ చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అ బ్దుల్లాపూర్‌మెట్ ఇన్‌స్పెక్టర్ వి. అశోక్‌రెడ్డి, కిక్కర గోపీశంకర్ యాదవ్, ప్రభాకర్ గౌడ్, బండి. నరేష్, సతీష్, సంతోష్ గౌడ్, స్థానిక ఎస్‌ఐ మాధవ రావు, సీనియర్ న్యాయవాదులు రాజేష్, జం గయ్య, సాయికుమార్, సైదులు, సతీష్ ,జయసుధ, పద్మజ, మేఘన, శృతి, సాంబ శివ రా వు, నాగ మణి, కాలనీ పెద్దలు తోర్పునూరి. జంగయ్య గౌడ్, యాదగిరి, కస్తూరి రమేష్,అచ్చిని మహేష్, నవాజ్, సుధాకర్, రాజు, సోమేష్ తిరుమలేశ్, శిరోమణి మహిళలు పాల్గొన్నారు.